Saturday, July 27, 2024

పెట్రోల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన బస్సు: 20 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

20 Members injured in Bus collided to Petrol tanker

నిజామాబాద్: పెట్రోల్ ట్యాంకర్‌ను ఆర్‌టిసి బస్సు ఢీకొట్టిన సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ శివారులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బస్సు 30 మంది ప్రయాణికులతో వరంగల్ నుంచి నిజామాబాద్‌కు వెళ్తుండగా ఆర్ముర్ సమీపంలో పెట్రోల్ ట్యాంకర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News