Wednesday, April 24, 2024

రాష్ట్రంలో 205 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

205 new covid cases reported in telangana

హైదరాబాద్:  రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 38,085 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 205 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 79 కొత్త కేసులు నమోదు కాగా, హన్మకొండ జిల్లాలో 19, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 14, రంగారెడ్డి జిల్లాలో 13 కేసులు వెల్లడయ్యాయి. అదే సమయంలో 185 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,77,546 పాజిటివ్ కేసులు నమోదు కాగా 6,69,673 మంది ఆరోగ్యవంతులయ్యారు. కరోనాతో రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో 3,871 మంది చికిత్స పొందుతున్నారు. కాగా ఇప్పటి వరకు కరోనాతో మరణించినవారి సంఖ్య 4,002కి చేరుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News