- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. ఎపిలో గడిచిన 24 గంటల్లో మొత్తం 72,731మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,100 మందికి వైరస్ సోకినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇక కరోనాతో మరో 26 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 19,05,023 లక్షలకు చేరుకుంది. ఇప్పటివరకు కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య 12,870కు చేరింది. ప్రస్తుతం ఎపిలో 33,964 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గత 24 గంటల్లో 3,435మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
2100 New Corona Cases Reported in AP
- Advertisement -