Monday, May 13, 2024

పిఒకెలో బస్సు ప్రమాదం: 22 మంది మృతి

- Advertisement -
- Advertisement -

22 killed in Bus crash in POK

ఇస్లామాబాద్: బుధవారం పాక్ ఆక్రమిత కాశ్మీర్(పిఒకె)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో 22మంది చనిపోగా, 8మంది గాయపడ్డారు. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు 500 మీటర్లకుపైగా లోతైన లోయలో పడిపోయిన ఘటనలో వీరు మరణించారు. సుధ్‌నోతి జిల్లా నుంచి పంజాబ్(పాక్)లోని రావల్పిండివైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పాక్ పత్రిక డాన్ వెబ్‌సైట్ పేర్కొన్నది. ప్రమాద ప్రాంతంలోని గ్రామ మసీదులో మతపెద్ద ఒకరు లౌడ్‌స్పీకర్‌లో జరిగిన దుర్ఘటన గురించి తెలియజేస్తూ బాధితులకు సహాయమందించాలని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News