Thursday, May 2, 2024

తెలంగాణలో 26మంది ఐఏఎస్‌ల బదిలీలు..

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో పరిపాలన సౌలభ్యం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి ప్రక్షాళనకు దిగినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఐఏఎస్‌ అధికారుల బదిలీలు కొనసాగతున్నాయి. ఇప్పటికే పలువురు ఐఏఎస్‌, ఐపీఎస్ లను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసిన విషయం తెలిసిందే.

బుధవారం తెలంగాణలో మరో 26 మంది ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది.ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ కార్యదర్శిగా స్మితా సబర్వాల్ ను నియమించగా… ఇరిగేషన్ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను, సీఎంవో సంయుక్త కార్యదర్శిగా సంగీతా సర్వే సత్యనారాయణను, నల్గొండ జిల్లా కలెక్టర్ గా హరిచంద్రను ప్రభుత్వం నియమించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News