అనంతపురం: జిల్లా బస్టాండ్ సమీపంలో ముగ్గురు విద్యార్థినులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. నిద్ర మాత్రలు మింగి అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో చుట్టుప్రక్కలవారు గమనించి వెంటనే దగ్గరలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు వారికి వైద్యం అందించి ఎలాంటి ప్రాణపాయం లేదని తెలిపారు. వివరాల్లోకి వెళితే.. ధర్మవరానికి చెందిన ముగ్గురు విద్యార్థినులు ఓ వ్యక్తి వద్ద రూ.20 వేలు అప్పు తీసుకున్నారు. అయితే, తీసుకున్న అప్పు తీర్చకపోవడంతో సదరు వ్యక్తి వారిపై వేధింపులకు దిగాడు. దీంతో వేధింపులు తట్టుకోలేని విద్యార్థినులు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా జిల్లా బస్టాండ్ దగ్గరలో ముగ్గరు కూడా ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని వారి నుంచి వివరాలు సేకరించి, బాధితుల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
3 Girl students attempt suicide near Anantapur bus stand