Saturday, April 27, 2024

ఒకే రోజులో 3 లక్షల రేషన్ కార్డులు పంపిణీ: గంగుల

- Advertisement -
- Advertisement -

3 Lakh ration cards distributed in telangana

కరీంనగర్: ఒకే రోజులో మూడు లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేశామని సివిల్ సప్లై, బిసి సంక్షేమ శాఖ మంత్రి మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్రం 53 లక్షల రేషన్ కార్డులు మాత్రమే ఇస్తే తెలంగాణ ప్రభుత్వం అదనంగా 35 లక్షల రేషన్ కార్డులు అందిస్తోందన్నారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా 2.79 కోట్ల మంది పేదలకు లబ్ధి జరుగుతుందన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి రేషన్ కార్డులు మంజూరు చేస్తామని, కొత్త రేషన్ కార్డులు పొందిన పేదలకు ఆగస్టు నుంచి బియ్యం పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, నగర మేయర్ వై. సునీల్ రావు, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి (కరీంనగర్ జిల్లా) పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News