- Advertisement -
అమరావతి: ఎపిలో కోవిడ్-19 కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 55,740 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 349 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ బారినపడి మరో నలుగురు మృతి చెందారు. అదే సమయంలో 472 మంది కోలుకున్నారు. ఎపిలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,81,948కి పెరిగింది. ఇప్పటివరకు 7,104 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి నుంచి 8,71,588 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా… ప్రస్తుతం రాష్ట్రంలో 3,256 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
- Advertisement -