Friday, May 3, 2024

అసోంలో 5 లక్షల వరద బాధితులు

- Advertisement -
- Advertisement -

5 lakh flood victims in Assam

 

గువహతి : ఈశాన్య రాష్ట్రం అసోంలో వరదల పరిస్థితి దిగజారింది. దాదాపు 5 లక్షల మంది వరద బాధితులు అయ్యారు. ఆదివారం భారీ వర్షాలు, వరదల సంబంధిత దుర్ఘటనలతో ఇద్దరు మృతి చెందారు. ఇప్పుడు మొత్తం మృతుల సంఖ్య 16కు చేరింది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కన్నా ధేమాజీ బాగా దెబ్బతింది. అధికార యంత్రాంగం భారీ స్థాయిలో సహాయక చర్యలు చేపట్టింది. వరద బాధితులను గుర్తించి ఎప్పటికప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరదలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 21 జిల్లాలో జనం వరదలతో తల్లడిల్లుతున్నారు. గోల్పారా జిల్లాలో ప్రమాదాలు జరిగినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అధికారిక ప్రకటనలో తెలిపింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News