Sunday, April 28, 2024

నిమ్స్ నయా రికార్డ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్‌: ఆరోగ్యశ్రీ ద్వా రా ఈ ఏడాది గడిచిన నాలుగు నెలల్లో 50 మూ త్రపిండ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతం గా పూర్తి చేసి నిమ్స్ ఆసుపత్రి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా సాధ్యం కాని ఈ ఘనతను నిమ్స్ వైద్యు లు సాధించారు. ఆరోగ్యశ్రీ ద్వారా పూర్తి ప్రభు త్వ సహకారంతో రోగికి 15 లక్షల విలువైన ఉచిత చికిత్సను ప్రభుత్వం అందిస్తున్నది. నిమ్స్ తో పాటు గాంధీ, ఉస్మానియాల్లో గుండె, కాలే యం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, పాంక్రియాస్, చర్మం, కార్నియా, ఎముక కణజాలం, గుండె కవాటాలు, రక్త నాళాల మార్పిడి సర్జరీలను ప్రభుత్వం అరోగ్య శ్రీ కింద ఉచితంగా అందిస్తున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన 2014 నుంచి నిమ్స్ ఆసుపత్రి చరిత్రలో 862 కిడ్నీ మా ర్పిడి ఆపరేషన్లు (522 లైవ్, 340 కాడవర్ కే సులు) చేశారు.

2015 నుండి, ప్రతి సంవత్సరం సగటున 100 కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయి. గత ఏడాది 2022లో 93 మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లు చేయగా ఈ ఏడాది కేవలం నాలుగు నెలల్లోనే ఆరోగ్యశ్రీ కింద 50 మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లు (28 లైవ్, 22 కాడవర్ కేసులు) విజయవంతం చేసి కొత్త రికార్డు నమోదు చేసుకుంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న జీవన్‌ధన్ కార్యక్రమం ద్వారా చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న మూత్రపిండ మార్పిడి ఆపరేషన్‌ను అతి తక్కువ సమయంలో చేస్తున్నారు. నిమ్స్ యూరాలజీ వైద్యులు మూత్రపిండ మార్పిడి ఆపరేషన్లతో పాటు ఎటువంటి అంతరాయం లేకుండా ఇతర యూరాలజీ శస్త్రచికిత్సలను కొనసాగిస్తున్నారు.

నిమ్స్ యూరాలజీ టీమ్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ ప్రొఫెసర్, హెచ్‌ఓడి, డా.సి.హెచ్.రామ్ రెడ్డి ప్రొఫెసర్, డా.ఎస్.విద్యా సాగర్, డా.జి.రామచంద్రయ్య, డా.జి.వి.చరణ్ కుమార్, డా. ధీరజ్, డా.అరుణ్‌కుమార్, డా.సునీల్, డా.వినయ్, డా.విష్ణు, డా.జానకి, డా.పవన్, డా.హర్ష, డా.పూవర్సన్, డా.సూరజ్, డా.షారుఖ్, డా.అనంత్, అనస్తీషియా బృందం డాక్టర్.నిర్మల ,డా. ఇందిర, డాక్టర్ కిరణ్, డాక్టర్ షీబాని, నెఫ్రాలజీ బృందం డాక్టర్ టి. గంగాధర్, డా.శ్రీభూషణ్ రాజు, డా.జి.స్వర్ణలతలు సేవలందించిన వైద్యుల జాబితాలో ఉన్నారు.

ఆర్గాన్ డొనేషన్స్ లో తెలంగాణ టాప్…

నాలుగు నెలల్లో 50 కిడ్నీ మార్పిడి సర్జరీలు చేసి, పునర్జన్మను ప్రసాదించిన నిమ్స్ వైద్యులను రాష్ట్ర ఆర్థిక, వైద్యా ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అభినందించారు. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో అత్యంత ఖరీదైన వైద్యం పేదలకు చేరువైందని తద్వారా అనేక మంది అవయవ మార్పిడి బాధితులకు పునర్జన్మ లభిస్తుందని కొనియాడారు. గాంధీ ఆసుపత్రిలో రూ. 35 కోట్లతో ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు, ఇది అందుబాటులోకి వస్తే వైద్య సేవలు మరింత వేగంగా అందుతాయి. ఆర్గాన్ డొనేషన్ లో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అవయవదానం ప్రోత్సహించి, జీవన్ దాన్ లో నమోదు చేసుకొని ఎదురు చూస్తున్న వారికి నిండు జీవితం అందించాలని వైద్యులు పిలుపునిచ్చారు.

కార్మికుల పక్షపాతి సిఎం కెసిఆర్ :మంత్రి హరీశ్‌రావు

కార్మిక పక్షపాతి సిఎం కెసిఆర్ మేడే సందర్భంగా రాష్ట్రంలోని పారిశుద్ద కార్మికులకు శుభవార్త చెప్పారు. నెలనెలా అందుతున్న జీతానికి అదనంగా మరో వెయ్యి రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటించారు. జీహెచ్‌ఎంసీ, మెట్రో వాటర్‌వర్క్‌తో పాటు మున్సిపల్ ,పంచాయతీరాజ్ శాఖల పరిధిలో పనిచేస్తున్న 1,06,474 మందికి లబ్ది చేకూరనుంది. ఈమేరకు ఆర్ధికశాఖ జీవో 39, 40లను విడుదల చేసినట్లు ట్విట్టర్లో ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News