Sunday, April 28, 2024

హిమాచల్‌ప్రదేశ్ లో ఘోర ప్రమాదం.. 9మంది మృతి

- Advertisement -
- Advertisement -

9 Killed after Private Bus falls into Valley in Chamba

సిమ్లా: హిమాచల్‌ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయిన దుర్ఘటన రాష్ట్రంలోని‌ చంబా జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని తీసా సబ్‌ డివిజన్‌ వద్ద 18 మంది ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలంలోనే ఆరుగురు మృతి చెందగా, మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.అయితే మార్గం మధ్యలోనే మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.4లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఈ ప్రమాదంలో గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

9 Killed after Private Bus falls into Valley in Chamba

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News