- Advertisement -
హైదరాబాద్: జూపార్క్లు, కవ్వాల్, అమ్రాబాద్ టైగర్ రిజర్వు ఫారెస్ట్లో ఉన్న జంతువులు అనారోగ్యం బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. వన్యప్రాణుల ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులతో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమీక్షలు జరిపారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. జంతువులకు సురక్షితమైన ఆహారం అందించాలని, జూలో జంతువులకు ఆహారం అందించేవారికి కరోనా పరీక్షలు చేయాలని వైద్య శాఖకు ఆదేశించారు. వేసవి తాపం నుంచి వన్యప్రాణులను రక్షించాలన్నారు.
Corona test to Zoo employees in Telangana
Corona test to Zoo employees in Telangana
- Advertisement -