Saturday, April 27, 2024

రాష్ట్రంలో కొత్తగా 152 కొవిడ్ కేసులు

- Advertisement -
- Advertisement -

152 Corona positive cases in Telangana

మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో రోజువారీగా కొవిడ్ కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 19,527 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా…152 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,89,083కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి 401 మంది కోలుకోగా, ఇప్పటివరకు 7,82,253 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 99.13 శాతంగా నమోదైంది. మరో 856 మంది ఫలితాలు రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News