- Advertisement -
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలలో చదువుతున్న ఒకటి నుంచి తొమ్మిదొ తరగతుల విద్యార్థులను తదుపరి తరగతికి ప్రభుత్వం ప్రమోట్ చేసింది. పరీక్షలు లేకుండా విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహమ్మారి కరోనా వైరస్(కోవిడ్-19)ను ఆరికట్టేందుకు ప్రభుత్వం లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలతోపాటు అన్నీ కోచింగ్ సెంటర్లు మూత పడిన విషయం తెలిసిందే. అయితే, కరోనా రోజురోజుకు మరింతగా విజృంభిస్తుడడంతో తిరిగి తరగతులు నిర్వహించే అవకాశం లేకుండాపోయింది. దీంతో 1-9వ తరగతుల విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక, మధ్యలో ఆగిపోయని పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది.
- Advertisement -