Tuesday, April 30, 2024

నగరంలో పెరిగిన వాహనాల రాకపోకలు

- Advertisement -
- Advertisement -

Hyderabad-Roads

హైదరాబాద్: నగరంలో లాక్ డౌన్ నిబంధనల్లో సడలింపుల వల్ల కార్యకలపాలు పెరిగాయి. దీంతో రహదారులపైకి వాహనాల రాకపోకలు పెరిగాయి. హైదరాబాద్ లో స్టీల్, సిమెంట్, ఎలక్ట్రికల్స్, మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. రిజిస్ట్రేషన్, రవాణాశాఖ కార్యలయాల్లోనూ కార్యకలపాలు కొనసాగుతున్నాయి. ఐటి పరిశ్రమల్లోనూ 33శాతం మంది ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

లాక్‌డౌన్‌ కారణంగా బోసిపోయిన రోడ్లు తిరిగి వాహన రాకపోకలతో సందడిగా మారాయి. సాధారణ రోజులతో పోలిస్తే 35శాతం వాహనాలు రోడ్లపైకి వచ్చాయని అధికారులు చెబుతున్నారు. వెసులుబాటు కల్పించిన రంగాలకు చెందిన వాళ్లే బయటకు రావాలని పోలీసులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.

Hyderabad Roads is Bustling With Vehicular Traffic

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News