- Advertisement -
షార్జా: ప్రముఖ క్రికెటర్ సురేశ్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు షాక్ ఇచ్చాడు. దుబాయిలో సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఐపిఎల్– 2020 నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగత కారణాలతోనే తప్పుకుంటున్నట్టు సిఎస్ కే యాజమాన్యం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. రైనా దుబాయి నుంచి ఇండియాకు వెళ్లారని యాజమాన్యం తెలిపింది. రైనా ఏ కారణం వల్ల తప్పుకోవాల్సి వచ్చిందనే విషయంపై మాత్రం సిఎస్ కే స్పష్టత ఇవ్వలేదు. ఈ సమయంలో సురేశ్ రైనాతో పాటు ఆయన కుటుంబానికి మద్దతుగా ఉంటామని మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ సిఇవొ కెఎస్ విశ్వనాథన్ ప్రకటించారు. అయితే ఇప్పటికే జట్టులో పలువురికి కరోనా వైరస్ సోకింది. సెప్టెంబర్ 1 నాటికి సిఎస్ కే ఆటగాళ్ల క్వారంటైన్ ముగియనుంది.
- Advertisement -