- Advertisement -
కాశ్మీర్: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో శనివారం తెల్లవారుజామున భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. జడూరా ఏరియాలో ఉగ్రవాదులు ఉన్నట్టు సమాచారం రావడంతో కూంబింగ్ కు వెళ్లిన బలగాలపై టెర్రరిస్టులు కాల్పులు జరిపారు. భద్రతాదళాల కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమైనట్టు ఆర్మీ ప్రతినిధి కల్నల్ రాజేష్ కలియా తెలిపారు. కాల్పుల్లో గాయపడిన జవాన్ చికిత్స పొందుతూ చనిపోయాడు. మిగిలిన ముష్కరుల కోసం భద్రతా సిబ్బంది గాలింపు కొనసాగుతోందని కల్నల్ రాజేష్ పేర్కొన్నారు.
Three militants And one soldier killed in encounter
- Advertisement -