- Advertisement -
హైదరాబాద్: భారత మాజీ ప్రధాన మంత్రి పివి నర్సింహారావు, ఉమ్మడి ఎపి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ లకు భారతరత్న ప్రకటించాలని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. పివి, ఎన్టీఆర్ పేర్లు చెప్పి పబ్బంగడుపుకోవాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయని కవిత ఆరోపించారు. బిజెపి నాయకులు పివి, ఎన్టీఆర్ సమాధుల వద్ద నాటకాలాడటం కాదు తక్షణమే భారతరత్న ప్రకటించాలని డిమాండ్ చేశారు. రోహింగ్యాలు, విదేశీయులు ఎక్కడ ఉన్నా అది కేంద్ర వైఫల్యమే అన్నారు. రూ. 1,350 కోట్లు వరదసాయం చేశాకే బిజెపి నేతలు మాట్లాడాలని కవిత పేర్కొన్నారు.
MLC Kavitha demand Bharat Ratna for PV and NTR
- Advertisement -