- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకూ తగ్గుతున్నాయి. గడిచిన 24గంటల్లో 551 కరోనా పాజిటివ్ కేసులు, నలుగురు మృతి చెందారు. అదే సమయంలో 744 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోవిడ్ -19 కేసులు 8,72,839కి చేరింది. ఇప్పటివరకు 7,042 మంది కరోనాతో మృతి చెందారు. ఎపిలో ఇప్పటివరకు 8,57,473 లక్షల మంది బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 5,429 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 56,187 మందికి కరోనా టెస్టులు చేసినట్టు ఆరోగ్యశాఖ పేర్కొంది.
551 New Covid-19 Cases 4 Deaths in AP
- Advertisement -