Tuesday, May 7, 2024

రిక్షా కార్మికుడి ఇంట్లో భోజనం చేసిన అమిత్ షా

- Advertisement -
- Advertisement -

Amit Shah had lunch at the home of a rickshawala

డోమ్‌జూర్(ప.బెంగాల్): డోమ్‌జూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బుధవారం మధ్యాహ్నం రోడ్‌షో నిర్వహించిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఒక రిక్షా కార్మికుడి ఇంట్లో భోజనం చేశారు. ఆ నిరుపేద ఇంట్లో నేలమీద కూర్చునే ఆయన భోజనం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దేశానికే హోం మంత్రి అయిన అమిత్ షా ఒక సామాన్యుడిలా ఆ ఇంట్లోని మహిళలు వండిన అన్నం, పప్పు, కూరలు, సలాడ్‌తో భోజనం చేసి వారి బాగోగులను విచారించారు. అమిత్ షా వెంట డోమ్‌జూర్ నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న రాజీబ్ బెనర్జీ, ఇతర నాయకులు ఉన్నారు. అంతకుముందు, హౌరా జిల్లాలోని డోమ్‌జూర్ పట్టణంలోని ఇరుకు వీధుల్లో అమిత్ షా రోడ్ షో సాగింది. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరైన ఈ రోడ్‌షోలో అమిత్ షాతోపాటు బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పాల్గొన్నారు. జగ్‌దీష్‌పూర్ హాట్ నుంచి కోనా క్రాసింగ్ వరకు ఈ రోడ్ షో సాగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News