Tuesday, April 30, 2024

సిరియాలో వైమానిక దాడులు…. 200 మంది మృతి

- Advertisement -
- Advertisement -

మాస్కో: సిరియాలో రష్యా యుద్ధ విమానాలు జరిపిన దాడిలో 200 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. సిరియా నది సమీపంలోని పల్మైరా ప్రాంతంలో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం రావడంతో రష్యా సైన్యం వైమానిక దాడులు చేసింది. ఈ దాడులో 200 మంది తీవ్రవాదులు చనిపోగా 24 వాహనాలు ధ్వంసమయ్యాయి. అర టన్ను పేలుడు పదార్థాలు ధ్వంసమైనట్లు రష్యా వైమానిక దళం అధికారి అలక్సందర్ కార్పోవ్ తెలిపాడు. పల్మైరా ప్రాంతంలో ఉగ్రవాదులు శిక్షణ పొందుతుండడంతో పాటు భారీ మొత్తంలో మందు గుండు సామాగ్రి తయారు చేస్తుండడంతో దాడులు జరిగినట్టు సమాచారం. 2015 నుంచి సిరియాలో ఉగ్రవాదులపై రష్యా సైన్యం దాడులు చేస్తోంది. ఇద్దరు రష్యా సైనికులను గతంలో చంపడంతో ఈ దాడులకు రష్యా పాల్పడుతున్నట్టు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News