చెన్నై: ఓ లాయర్ తన లవర్ ను దారుణంగా చంపేసి బాత్రూమ్లో పూడ్చిపెట్టి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడులోని మధురైలో చోటు చేసుకుంది. మధురైకి చెందిన హరికృష్ణన్(40) కొన్ని సంవత్సరాల క్రితం నుంచి భార్యకు దూరంగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే హరికృష్ణన్కు యోగా టీచర్ చిత్రదేవీ (36)తో పరిచయం ఏర్పడింది. అదికాస్త పెరిగి ప్రేమకు దారి తీసింది. గత నెల ఏప్రిల్ 2న చిత్రదేవీ కనిపించడం లేదని ఆమె తండ్రి కన్నయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమె తండ్రి కన్నయ్య చిత్రదేవీ, హరికృష్ణన్ మధ్య జరిగిన ఫోన్ ఆడియో రికార్డులను పోలీసులకు ఇచ్చాడు. విషయం తెలుసుకున్న హరికృష్ణన్ మంగళవారంనాడు తన ఇంట్లోనే బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించాడు. ఘటనాస్థలి నుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. చిత్రదేవీని తానే చంపేసి తన ఇంట్లోని బాత్రూమ్లో పూడ్చిపెట్టినట్టు సూసైడ్ నోట్లో రాశాడు. ఆమెను హత్యచేశానన్న బాధ భరించలేకనే తాను చనిపోతున్నట్టు పేర్కొన్నాడు.
lawyer who killed girlfriend at madurai