Thursday, May 2, 2024

నిలోఫర్ లో కరోనాతో హెడ్ నర్సు మృతి

- Advertisement -
- Advertisement -

Niloufer head nurse died with coronavirus

 

హైదరాబాద్: నిలోఫర్ ఆస్పత్రి హెడ్ నర్సు స్వరూప రాణి(53) కరోనా వైరస్‌తో పోరాడి దుర్మరణం చెందారు. ఎప్రిల్ 28న ఆమెకు కరోనా పాజిటివ్ రావడంతో మాసబ్ ట్యాంక్‌లోని మహవీర్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం ఉదయం కన్నుమూసింది. 1990లో నిలోఫర్ ఆస్పత్రిలో ఆమె నర్సుగా చేరారు. 2016లో హెడ్ నర్సుగా పదోన్నతి పొందారు. నిలోఫర్ ఆస్పత్రిలో 58 వైద్య సిబ్బందికి కొవిడ్ సోకింది. సోకిన వారిలో 15 మంది వైద్యలు, 18 మంది స్టాఫ్ నర్సులు, 25 మంది వైద్య సిబ్బంది ఉన్నారు. కరోనా పాజిటివ్ వచ్చి సెక్యూరిటీ, పారిశుద్ధ, కాంట్రాక్టు ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది, ఆస్పత్రుల్లో చేరలేక, ఇళ్లలో చేరలేక ఇబ్బంది పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News