Thursday, May 9, 2024

సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్.. మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ /వరంగల్ కార్పొరేషన్ : తోటి విద్యార్థి వేధింపులు తాళలేక మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. భూపాలపల్లికి చెందిన శంకరాచారి, రమ దంపతుల కుమార్తె రక్షిత వరంగల్ జిల్లా నర్సంపేటలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాల లో ఈసీ మూడవ సంవత్సరం చదువుతోంది.

ఈ క్రమంలో ఓ విద్యార్థి మరో విద్యార్థితో కలిసి ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడంతో మనస్థాపానికి గురై వరంగల్ నగరంలోని తన బంధువుల ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది మృతదేహాన్ని శవ పరీక్షల నిమిత్తం ఎంజీఎం మార్చురీకి తరలించారు ఇది ఇలా ఉంటే గత రెండు రోజుల క్రితం భూపాలపల్లిలో రక్షితపై మిస్సింగ్ కేస్ నమోదయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News