Tuesday, June 17, 2025

వైసిపి నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు: జగన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎపిలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసిపి మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) తెలిపారు. తెనాలిలో జగన్ పర్యటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడారు9. శాంతిభద్రతలు అదుపు తప్పాయని అన్నారు. తెనాలిలో అన్యాయమైన ఘటన జరిగిందని, దారుణ పరిస్థితులు కనిపిస్తున్నాయని, మండిపడ్డారు. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని, వైసిపి నేతలపై (YSRCP leaders) తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెడ్ బుక్ తో వేధించి హింసిస్తున్నారని, పోలీసుల చేతిలో దెబ్బలు తిన్నవారు.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడినవారని అన్నారు. ముగ్గురు యువకులను పోలీసులు దారుణంగా కొట్టారని, రాకేష్ అనే యువకుడు హైదరాబాద్ లో పనిచేస్తున్నాడని చెప్పారు.

పాత కేసులో వాయిదా కోసం తెనాలికి రాకేష్ వచ్చాడని, రాకేష్ ను చూడటానికి అతని స్నేహితులు వచ్చారని పేర్కొన్నారు. ఐతానగర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుగుతున్న…గొడవను ఆపేందుకే యువకులు వెళ్లారని, కానిస్టేబుల్ సివిల్ డ్రెస్ లో గొడవ పడుతుంటే ఆపేందుకు వెళ్లారని తెలియజేశారు. గొడవను ఆపాలనుకోవడమే వారు చేసిన తప్పా? అని జగన్ ప్రశ్నించారు. కానిస్టేబుల్ యూనిఫామ్ లో లేడని, అతను కానిస్టేబుల్ అనే విషయం కూడా వారికి తెలీదని జగన్ స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News