- Advertisement -
రాయ్ పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో శుక్రవారం ఎన్ కౌంటర్ జరిగింది. చోటే భేథియాలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరగడంతో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలం నుంచి మందుగుండు సామాగ్రి, ఎకె 47 రైఫిళ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులు బంద్ కు పిలుపునిచ్చారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. భద్రాచలం ఏజెన్సీలో విస్తృత తనిఖీలు చేపట్టారు. దుమ్ముగూడెం, వెంకటాపురం, వాజేడుకు రాత్రివేళ ఆర్ టిసి బస్సులు, ప్రైవేట్ వాహనాలు నిలిపివేశారు. ఏజెన్సీలో కూంబింగ్ కొనసాగుతుంది.
- Advertisement -