న్యూఢిల్లీ: జూన్ 12వ తేదీన లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా (Air India) విమానం ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా బోయింగ్ 787, 777 విమానాలపై విస్తృత తనిఖీలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఎయిర్ ఇండియానే కాదు.. ఇతర సంస్థల విమానాలు కూడా వార్తల్లో నిలుస్తున్నాయి. తాజాగా పక్షి ఢీకొట్టడంతో ఎయిర్ ఇండియా విమాన సర్వీసును రద్దు చేసింది.
శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి పుణెకు ఎయిర్ ఇండియా (Air India) AI2470 విమానం చేరుకుంది. అయితే విమానం ల్యాండ్ అయిన తర్వాత నిర్వహించిన తనిఖీల్లో పక్షి ఢీ కొట్టినట్లు గుర్తించారు. దీంతో ఇంజనీరింగ్ టీం విస్తృత తనఖీలు చేపట్టారు. ఆమె విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ప్రయాణికులకు పసతి ఏర్పాట్లతో పాటు, పూర్తి రీఫండ్లు లేదంటే ఉచిత రీషెడ్యూలింగ్ అందిస్తున్నట్లు పేర్కొంది. ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు కూడా చేస్తామని స్పష్టం చేసింది.