నిబంధనలకు వ్యతిరేకంగా ఫుట్ పాత్ నిర్మాణం
మన తెలంగాణ /మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా చేప్పట్టిన ఫుట్ పాత్ నిర్మాణ పనుల్లో సంభందిత కాంట్రాక్టర్ నిభంధనలకు తిలోదకాలు ఇచ్చి ఇష్టారాజ్యంగా ఫుట్ పాత్ నిర్మాణ పనులు చేస్తున్నారని పట్టణ ప్రజలు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం ఫుట్ పాత్ నిర్మాణ పనులు చేయాల్సిన కాంట్రాక్టర్ వడ్డించే వాడు మన వాడైతే ఎక్కడ ఉన్నా ఇబ్బది లేదు అన్న చందంగా రోడ్డు విస్తరణ, ఫుట్ పాత్ నిర్మాణ పనులు చేస్తున్నారన్న ఆరోపణలు పట్టణ ప్రజల నుండి బలంగా వినిపిస్తున్నాయి. అందుకు నిదర్శనం రాత్రి వేళల్లో అధికారుల పర్యవేక్షణ లేకుండా పనులు చేయడమే. మున్సిపల్ కేంద్రంలో రోడ్డు మధ్య నుండి ఇరువైపులా 40 ఫీట్లు రోడ్డు విస్తరణ చేయాల్సి ఉండగా నిబంధనలకు నీళ్లు వదిలి రోడ్డు విస్తరణ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారులు పర్యవేక్షణ లేకుండా రోడ్డు విస్తరణ, ఫుట్ పాత్ నిర్మాణ పనులు జరుగడమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మోత్కూర్ మున్సిపల్ కేంద్రంలో శనివారం రాత్రి సుమారు పది గంటల సమయంలో అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ఫుట్ పాత్ నిర్మాణ పనులు జరగడాన్ని ప్రజలు వ్యతిరేకించడంతో అక్కడ వేసిన కాంక్రీటు మాలును ఇతర ప్రదేశాలకు కూలీలతో తరలించడం కోసమెరుపు. రోడ్డు కన్నా ఎత్తులో మోరీలు నిర్మిచండం తో వర్షపు నీరు ఎటు వెళుతుందో ఎక్కడ నిలుస్తుందో తెలియని పరిస్థితి పట్టణ ప్రజల్లో ఏర్పడింది. సంబంధిత అధికారులను వివరణ కోరే ప్రయత్నం చేయగా ఎవరు స్పందించలేదు.