Tuesday, June 24, 2025

భారీ నష్టాల్లో మార్కెట్లు

- Advertisement -
- Advertisement -

ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం, హర్మూజ్ జలమార్గం మూసివేత వంటి కారణాల వల్ల దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలను చవిచూశాయి. ఇరాన్‌పై అమెరికా దాడుల కారణంగా మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు గురయ్యాయి. ప్రారంభంలో భారీ నష్టాలను చూసినప్పటికీ ఆఖరి సమయంలో మార్కెట్లు కోలుకున్నాయి. సోమవారం మార్కెట్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 511 పాయింట్లు తగ్గి 81,897 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 141 పాయింట్లు తగ్గి 24,972 వద్ద స్థిరపడింది. 30 సెన్సెక్స్ స్టాక్స్‌లో 9 పెరిగాయి, 21 పడిపోయాయి. హెచ్‌సిఎల్ టెక్, ఇన్ఫోసిస్, ఎల్ అండ్ టి షేర్లు 2.3% తగ్గాయి. ట్రెంట్, బిఇఎల్ 3.4 శాతం పెరిగాయి. నిఫ్టీలోని 50 స్టాక్‌లలో 35 నష్టాలతో ముగిశాయి. ఎన్‌ఎస్‌ఇ ఐటి ఇండెక్స్ 1.48 శాతం, ఆటో 0.92 శాతం, ఎఫ్‌ఎంసిజి 0.74 శాతం తగ్గాయి. మీడియా 4.39 శాతం పెరిగింది. మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ కూడా లాభాలతో ముగిశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News