- Advertisement -
పశ్చిమాసియా యుద్ధవాతావరణం నేపథ్యంలో బియ్యం ఎగుమతి దేశాలకు ఇబ్బంది ఏర్పడుతోంది. తాజా పరిణామాలతో భారతదేశపు ప్రత్యేక రకం బాస్మతి బియ్యం ఎగముతులు నిలిచిపొయ్యాయి. దాదాపు లక్ష టన్నుల వరకూ బాస్మతి బియ్యం రవాణా నౌకాశ్రయాలలో నిలిచిపోయింది. ఇండియా నుంచి ఇరాన్కు వెళ్లాల్సిన బాస్మతి బియ్యాన్ని భారత్లోని రేవు పట్టణాలలోనే నిలిపివేశారు. ప్రస్తుత ఘర్షణల దశలో సరుకు రవాణా ప్రమాదకరం అయింది. అందుకే దీనిని ముందుగానే నిలిపివేయాల్సి వచ్చినట్లు ఆలిండియా రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ సోమవారం ఓ ప్రకటనలోఓ తెలిపింది.
- Advertisement -