Monday, September 22, 2025

ఆర్‌టిసి కార్మికులకు గుడ్ న్యూస్..

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ఆర్‌టిసి కార్మికులకు యాజమాన్యం శుభవార్త చెప్పింది. దసరా పండుగ సమీపిస్తోన్న సందర్భంగా పండుగ అడ్వాన్స్ మంజూరు చేసింది. కార్మికులు, సిబ్బందికి దసరా సందర్భంగా పండుగ అడ్వాన్స్ మంజూరు చేస్తూ సోమవారం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించి వెంటనే సప్లిమెంటరీ పే బిల్లులు తయారు చేసి చెల్లింపు చేయాలని సూచించింది. ఈ అడ్వాన్స్‌ను 2025 నవంబర్ జీతం నుంచి ప్రారంభమయ్యేలా పది సమాన వాయిదాల్లో తిరిగి వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News