Tuesday, September 23, 2025

కోల్‌కతాలో భారీ వర్షాలు.. ఐదుగురు మృతి

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కోల్‌కతాను ముంచెత్తాయి. వరదల కారణంగా ఉత్తర కోల్‌కతా లోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులు జలమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ షాక్ వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, వరదల్లో కొట్టుకు పోయి మరో ఇద్దరు మరణించారు. ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉన్నందున దక్షిణ బెంగాల్ లోని పలు జిల్లాల్లో రానున్న కొన్ని గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వానల వల్ల పలు విమానాల రాకపోకలకు అంతరాయం కలిగినట్టు విమానయాన సంస్థలు వెల్లడించాయి.

అటు ఎయిరిండియా, ఇండిగో ప్రయాణికులకు అలర్ట్‌లు పంపించాయి. తాజా అప్‌డేట్‌లను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించాయి. భారీ వర్షాలకు అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఈదురుగాలులకు చాలా ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. కొన్ని భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ప్రజులు సాధ్యమైనంతవరకు ఇళ్లలోనే ఉండాలని , అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. భారీ వరదల వల్ల షాహిద్ ఖుదిరామ్, మైదాన్ స్టేషన్ల మధ్య పలు రైల్వే కార్యకలాపాలను నిలిపివేసినట్టు అధికారులు పేర్కొన్నారు.

ఉత్తరాది రాష్ట్రాలను ముంచెత్తిన వానలు
ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఉత్తరాఖండ్ , హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియలు విరిగి పడుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పంజాబ్, హర్యానా, చండీగఢ్‌ల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. పఠాన్‌కోట్, గుర్‌దాస్‌పుర్, ఫాజిల్కా, కపుర్ధలా , తరన్‌తరన్, ఫిరోజ్‌పుర్, హోశియార్‌పుర్, అమృత్‌సర్ జిల్లాల్లోని పలు గ్రామాలు నీట మునిగాయి. ఈ ఆరు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పంజాబ్‌లో వర్షాల కారణంగా పలురైళ్లు రద్దయ్యాయి. రాజస్థాన్ రాజధాని జైపుర్‌తో సహా పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి.

Also Read: చిరు-పవన్‌ల సినిమా.. ఆర్‌జివి ఆసక్తికర పోస్ట్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News