Sunday, April 28, 2024

డాక్టర్ ఆత్మహత్య కేసులో దోషిగా తేలిన ఆప్ ఎమ్‌ఎల్‌ఎ

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలో 2020లో డాక్టర్ ఆత్మహత్య కేసులో ఆప్ ఎమ్‌ఎల్‌ఎ ప్రకాష్ జర్వాల్‌ను దోషిగా ఢిల్లీ కోర్టు బుధవారం నిర్ధారించింది. 2020 ఏప్రిల్ 18న దుర్గా విహార్‌లో 52 ఏళ్ల డాక్టర్ రాజేంద్ర సింగ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో డియోలీ అసెంబ్లీ నియోజక వర్గం ఎమ్‌ఎల్‌ఎ ప్రకాష్ జర్వాల్ దోషిగా ప్రాసిక్యూషన్ నిరూపించిందని జడ్జి వెల్లడించారు.

ఈ తీర్పుపై మార్చి 13న జడ్జి వాదనలు వింటారు. డాక్టర్ తన ఆత్మహత్య నోట్‌లో తాను ఆత్మహత్య చేసుకోడానికి ఎమ్‌ఎల్‌ఎ జర్వాల్ ప్రధాన కారణమని రాసి ఉంచారు. దీని ఆధారంగా పోలీస్‌లు కేసు దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News