Sunday, September 21, 2025

అబుధాబి-ఢిల్లీ విమానం అత్యవసర ల్యాండింగ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అబుధాబి నుంచి ఢిల్లీకి సోమవారం బయలుదేరిన ఇండిగో సంస్థకు చెందిన 6ఇ 1406 విమానంలో సాంకేతిక లోపం కారణంగా అత్యవసరంగా మస్కట్ విమానాశ్రయానికి మళ్లించవలసి వచ్చింది. టేకాఫ్ అయిన కొంతసేపటికి సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించి ఏటీసీకి సమాచారం అందించారు.

అనుమతి తీసుకుని మస్కట్ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ప్రయాణికులకు హోటల్‌లో వసతి ఏర్పాటు చేశారు. విమానాన్ని పూర్తిగా పరీక్షించిన తరువాత ప్రయాణానికి విమానాన్ని సిద్ధం చేస్తామని ఇండిగో ప్రతినిధి ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News