టాలెంటెడ్ డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మహా సముద్రం’. శర్వానంద్ తన కెరీర్లో గమ్యం, ప్రస్థానం తరువాత మళ్లీ అలాంటి బలమైన పాత్రను ఈ సినిమాలోనే చేస్తున్నాడని ఫిల్మ్మేకర్స్ తెలియజేశారు. కాగా ఈ సినిమాలో శర్వానంద్కు జోడీగా అదితిరావు హైదరీ నటించబోతుందని అధికారికంగా ప్రకటించారు. అజయ్ భూపతి ఇప్పటికే అదితి రావుకి కథ కూడా వివరించగా ఆమె ఈ సినిమా చేయడానికి బాగా ఆసక్తిగా ఉందట.కాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చనిపోతుందని.. అలాగే స్టోరీ కూడా కాస్త కొత్తగా ఉంటుందని తెలిసింది. ఈ సినిమా పక్కా ఎమోషనల్ ఎంటర్టైనర్గా ఉంటుందట. ఇక త్వరలోనే ఈ సినిమాని సెట్స్పైకి తీసుకువెళ్లనున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వైజాగ్ నేపథ్యంలో నడిచే క్రైమ్ థ్రిల్లర్గా ఈ చిత్రం తెరకెక్కనుంది. అలాగే ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది.
Aditi Rao Hydari Starrer to ‘Maha Samudram’ Movie