Tuesday, June 17, 2025

ఎస్‌సి గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

జగద్గిరిగుట్ట, శామిర్‌పేటలోని సాంఘీక సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థినులు, గ్రామీణ ప్రాంతాలకు రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలకు రూ .2 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం కలిగిన మహిళా విద్యార్థులు రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇష్రత్ సూచించారు. కళాశాలలో బి.కాం (కంప్యూటర్ అప్లికేషన్స్), బి.కాం (బిజినెస్ అనలిటిక్స్), బి.ఎస్‌సి (డేటా సైన్స్),’

బి.ఎస్‌సి (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్) ఇతర గ్రాడ్యుయేట్ కోర్సులు అందిస్తున్నట్లు తెలిపారు. పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాలు, యూనిఫాంలు, దుప్పట్లు, బూట్లు మొదలైన వాటిని ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు. రోజుకు మూడు సార్లు పోషకమైన ఆహారం, స్నాక్స్, కాస్మెటిక్ ఛార్జీలు, వైద్య సౌకర్యం, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్, ప్రయోగశాలలు, లైబ్రరీ అందుబాటులో ఉంటాయి. ్ల కెరీర్ మార్గదర్శకత్వం, ప్లేస్‌మెంట్ సౌకర్యం అందిస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి జూన్ 23 చివరి తేదీ అని మహిళా అభ్యర్థులందరూ ప్రభుత్వం అందించే ఉత్తమ సౌకర్యాన్ని పొందాలని డాక్టర్ ఇష్రత్ కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News