Friday, May 3, 2024

క్షేత్రపాలకుడికి ఆకుపూజ

- Advertisement -
- Advertisement -

యాదాద్రిభువనగరి : శ్రీలక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామికి విశేషంగా ఆకుపూజను అర్చకులు నిర్వహించారు. మంగళవారం శ్రీఆంజనేయస్వామికి విశేషమైన రోజు కావడంతో ఉదయం శ్రీఅంజనేయస్వామి వారికి సింధూర లేపణం నిర్వహించి లక్ష తమలపాకులతో నాగవల్లి దళార్చన జరిపి శాస్త్రోక్తంగా ఆకుపూజను నిర్వహించారు. పాతగుట్ట పుష్కరిణి వద్ద గల ఆలయంలో ఆకుపూజను నిర్వహించగా భక్తులు పాల్గొని దర్శించుకున్నారు.

ఆలయ పూజలలో భక్తులు..
స్వామివారి దర్శనార్ధం వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకొని ఆలయంలో నిర్వహించినటువంటి నిత్యపూజల కైంకర్యాలలో పా ల్గొన్నారు. స్వామివారి దర్శనార్ధం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పిల్లాపాపలు, కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి క్షేత్రానికి వ చ్చారు. ఆలయంలో జరిగిన నిత్యపూజలు సుప్రభాతం,అర్చన, అభిషేకం, సుదర్శన నారసింహ హోమం, నిత్యకల్యాణం, పుష్పార్చన, జోడి సేవ తదితర పూజలలో భక్తులు పాల్గొని శ్రీ స్వామి వారిని దర్శించుకొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. కొండపైన కొలువుదీరిన శ్రీరామలింగేశ్వరస్వామి శివాలయంలో భక్తులు శివదర్శనం చే సుకొని పూజలు నిర్వహించగా, కొండకింద గల శ్రీపాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాన్ని కూడా భక్తులు సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయ నిత్యరాబడి..
స్వామివారి దేవస్థానం ఆలయ నిత్యరాబడిలో భాగంగా మంగళవారం రూ.18,51,152 ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాద విక్రయం ద్వారా రూ.8,72,350, కొండపైకి వాహన అనుమతి ద్వారా రూ.2,00,000, ప్రధాన బుకింగ్ ద్వారా రూ.2,01,944, వీఐపీ దర్శనం ద్వారా రూ. 1,35,000 బ్రేక్ దర్శనం ద్వారా రూ.1,59,600, వ్రతపూజల ద్వారా రూ.24,800 తో పాటు పలు శాఖలు, పాతగుట్ట ఆలయం నుండి నిత్యరాబడి స మకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

నారసింహుని సేవలో ట్రైనింగ్ ఐఏఎస్ అధికారులు..
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర ట్రైనింగ్ ఐఏఎస్ అధికారులు దర్శించుకున్నారు. మంగళవారం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన ఆరుగురు ట్రైనింగ్ ఐఏఎస్ అధికారులకు అర్చకులు వేదాశీర్వచనం అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News