Monday, April 29, 2024

‘అల వైకుంఠపురములో’ ట్రైలర్: పులి వచ్చింది.. మేక సచ్చింది..

- Advertisement -
- Advertisement -

 

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్ లో తరెకెక్కిన మూడో చిత్రం ‘అల వైకుంఠపురములో’. నిన్న యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ లో మ్యూజికల్ కన్సర్ట్ సందర్భంగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. పక్కా ఫ్యామిలీ ఎమోషన్స్‌ తోపాటు కామెడీ, యాక్షన్ వంటి అంశాలను ఇందులో చూపించారు. ‘ఈ భూమ్మీద పుట్టించే హక్కు ఇద్దరికే ఉంది.. ఒకటి నేలకు, రెండు వీళ్లకు..’ , ‘చరిత్రలో గొప్పగొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్లతోనే జరుగుతాయి’ అనే అదిరపోయే డైలాగ్స్ తో త్రివిక్రమ్ మరోసారి తన పెన్ పవర్ చూపించాడు. రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో పూజా హెగ్డే మరోసారి బన్నీతో రొమాన్స్ చేస్తుండగా.. సీనియర్ నటి టబు, సుశాంత్, నవదీప్, సునీల్, నివేదితా పేతురాజ్, మురళీ శర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది.

Ala Vikuntapuramulo movie trailer out

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News