Tuesday, April 30, 2024

నెహ్రూ కశ్మీర్ సమస్య తెస్తే మోడీ పరిష్కరించారు

- Advertisement -
- Advertisement -

జంజార్కా (గుజరాత్): నెహ్రూ కశ్మీర్ సమస్యను సృష్టించారు. ఏళ్ల తరువాత ప్రధాని మోడీ దీనిని పరిష్కరించారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఎన్నికలు జరిగే గుజరాత్‌లో బిజెపి గౌరవ్ యాత్రకు పచ్చజెండా చూపి అమిత్ షా గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి ప్రధాని నెహ్రూపై మండిపడ్డారు. ప్రధాని నెహ్రూ ఆర్టికల్ 370ని ప్రవేశపెట్టి ప్రత్యేకతను సంతరింపచేయడం వల్లనే ఆతరువాత కశ్మీర్ సమస్య సంక్షోభానికి దారితీసిందని, అయితే జటిల సమస్య మూలాలను గ్రహించి ప్రధాని మోడీ దీనిని తొలిగించివేసి సమస్యను పరిష్కరించారని కితాబు ఇచ్చారు.

బిజెపి సారధ్యంలో అయోధ్యలో రామాలయం నిర్మాణం చేపట్టేందుకు బిజెపి ఉద్యమించినప్పుడు కాంగ్రెస్ తిట్టిపోసిందని, అయితే తాము దీక్షతో వెళ్లడంతో రామాలయ నిర్మాణం సాధ్యమైందని, ఇప్పుడు జనానికి ఆకాంక్షలకు అనుగుణమైన రామాలయం ముందుకు రానుందని అమిత్ షా తెలిపారు. నెహ్రు అనాలోచిత చర్యతోనే కశ్మీర్ కొలిమి అంటుకుందని ఏళ్ల తరబడి రగులుకుని అక్కడనే కాకుండా జాతీయ స్థాయిలో సంక్షోభానికి దారితీసిందని విమర్శించారు. ప్రతి ఒక్కరూ ఆర్టికల్ 370 వద్దని చెప్పారు. అయితే ఈ దిశలో అన్ని చర్యలు తీసుకుని ఆర్టికల్ 370ని రద్దు చేసిన ఘనత, కశ్మీర్‌ను దేశంలో పూర్తి స్థాయిలో అనుసంధానం చేసిన ఖ్యాతి ప్రధానికే చెందుతుందన్నారు. అయోధ్య రామమందిర నిర్మాణం కూడా చిన్న పని కాదని, అయితే అసాధ్యాన్ని బిజెపి సుసాధ్యం చేసిందన్నారు. కాంగ్రెస్ హయాంలో గుజరాత్‌లో కర్ఫూలు పరిపాటి అయ్యాయని అయితే మోడీ అధికార క్రమంతో ఆ పీడరోజులు పొయ్యాయని తెలిపారు.

Amit Shah begins Gaurav Yatra in Gujarat

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News