Thursday, May 2, 2024

ఐపిఎస్ పాసింగ్ ఔట్ పరేడ్‌ను సమీక్షించిన అమిత్ షా

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణలోని హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (ఎస్‌విపిఎన్‌పిఎ)లో 75వ బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) ప్రొబేషనర్ల పాసింగ్-అవుట్ పరేడ్‌ను శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్షించారు. ఈరోజు ఇక్కడ సెరిమోనియల్ మార్చ్ తర్వాత హోంమంత్రి ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రసంగించారు.

155 మంది ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలు, 20 మంది ఫారిన్ ఆఫీసర్ ట్రైనీలు సహా మొత్తం 175 మంది ఆఫీసర్ ట్రైనీలు ఈ పరేడ్‌లో పాల్గొంటున్నారని అకాడెమీ డైరెక్టర్ అమిత్ గార్గ్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. 32 మంది మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలు సహా 155 మంది ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలు ఉన్నారని ఆయన తెలిపారు.
ఫారిన్ ఆఫీసర్ ట్రైనీలలో ఆరుగురు భూటాన్, ఐదుగురు మాల్దీవులు, ఐదుగురు నేపాల్, నలుగురు మారిషస్ పోలీసులున్నారని ఆయన తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News