Sunday, April 28, 2024

ఇడి ఎదుట హాజరైన రిలయన్స్ అడాగ్ చైర్మన్ అనిల్ అంబానీ

- Advertisement -
- Advertisement -

ముంబై: విదేశీ మారకద్రవ్యం చట్ట ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై రిలయన్స్ ఎడిఎ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ సోమవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఇడి) ఎదుట హాజరైనట్లు అధికార వర్గాలు తెలిపాయి.

ఈ కేసులో తన వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు అనిల్ అంబానీ(64) బల్లార్డ్ ఎస్టేట్ ప్రాంతంలోని ఇడి కార్యాలయంలో హాజరయ్యారని వర్గాలు తెలిపాయి. ఫారిన్ ఎక్స్‌చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) చట్టానికి చెందిన వివిధ సెక్షన్ల కింద అనిల్ అంబానీపై కేసు నమోదైంది. యస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్, ఇతరులపై నమోదైన మనీ లాండరింగ్ కేసులో అనిల్ అంబానీ 2020లో ఇడి ఎడి హాజరయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News