Monday, April 29, 2024

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎపి గవర్నర్

- Advertisement -
- Advertisement -

తిరుమల: ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ శనివారం కుటుంబ సమేతంగా తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు ఈఓ ధర్మారెడ్డి, అర్చకులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఈఓ గవర్నర్ దర్శన ఏర్పాట్లు చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆలయంలోని ధ్వజ స్తంభం వద్ద ప్రార్థనలు చేసి గర్భగుడిలో స్వామివారిని దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం నిర్వహించి, స్వామివారి తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని గవర్నర్‌కు ఈఓ ధర్మారెడ్డి అందజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News