Saturday, July 27, 2024

వివేక కేసులో చంద్రబాబుకు ఎపి హైకోర్టు నోటీసులు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని పులివెందులలో తన స్వగృహంలో హత్యకు గురైన వివేకానందరెడ్డి కేసులో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు ఎపి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుతో పాటు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సిబిఐ డైరెక్టర్లకూ కూడా నోటీసులు పంపింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను జనవరి 20 కి వాయిదా వేసింది హైకోర్టు. ఇక అప్పటి వరకు ఈ కేసుకు సంబంధించి కోర్టులో తుది నివేదిక దాఖలు చేయబోమన్న ఎజి శ్రీ రామ్ హామీని హైకోర్టు నమోదు చేసింది.

దర్యాప్తును యథాతథంగా కొనసాగించవచ్చని సూచిస్తూనే సౌభాగ్యమ్మ దాఖలు చేసిన అనుబంధ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. ఇదిలావుండగా వైఎస్ వివేకానందరెడ్డిని మార్చి 15న పులివెందులో గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చిన విషయం విదితమే. ఎన్నికల వేళ సంచలనం రేపిన ఈ కేసును ఎపి పోలీసుల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటుచేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఆ సిట్‌ను రద్దు చేసి మరో సిట్‌కు అప్పగించారు. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు వేగవంతంగా కొనసాగుతోంది. 1400 మందికి సిట్ నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకొని వివేకా హత్యపై కేసు వివరాల కోసం విచారణ చేపడుతున్నారు.

AP HC issues notice to Chandrababu in Viveka Case

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News