Tuesday, May 14, 2024

విద్యానిధికి దరఖాస్తుల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : మహాత్మా జ్యోతిబా ఫూలే బిసి ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద ఆర్ధిక సహాయం పొందేందుకు అర్హులైన బిసి, ఇబిసి అభ్యర్దుల దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర బిసి సంక్షేమ శాఖ కమిషనర్ బి.వెంకటేశం కోరారు. ఈ మేరకు గురువారం పథకం వివరాలను ఆయన వెల్లడించారు. ఈ పథకం కింద విదేశాలలో పిజి విద్యను అభ్యసించాలనుకునే బిసి, ఇబిసి విద్యార్దులు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

ఈ విద్యా సంవత్సరానికి (2023) సెప్టెంబర్,- అక్టోబర్ సెషన్‌కు సంబంధించి అభ్యర్దుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ తేది 01.09.2023 న ప్రారంభమై 30.09.2023 న ముగుస్తుందన్నారు. అభ్యర్ధులు 30.09.2023లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు, ఆన్ లైన్ అప్లికేషన్లకు http://www.telanganaepass.cgg.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News