Sunday, April 28, 2024

మంత్రి కెటిఆర్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

- Advertisement -
- Advertisement -
  • రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్

ధర్మపురి: రాష్ట్ర ఐటి, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ధర్మపురి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఆక్టోబర్ 3న రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కెటిఆర్ ధర్మపురిలో పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా శుక్రవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాష, ఎస్పీ ఎగ్గడి భాస్కర్‌తో కలిసి మాతా శిశు కేంద్రం, ఫైలాన్, హెలిప్యాడ్ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానాన్ని మంత్రి ఈశ్వర్ పరిశీలించారు. నూతనంగా నిర్మాణం అవుతున్న పైలాన్ బహిరంగ సభా స్థలి, కావాల్సిన ఏర్పాట్లు మాతా శిశు ఆసుపత్రి భవనం ప్రారంభోత్సవాల్లో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై కలెక్టర్, ఎస్పీలకు మంత్రి దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో జగిత్యాల అదనపు కలెక్టర్లు బిఎస్ లత, దివాకర, డిసిఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జడ్పీటిసి బత్తిని అరుణ, మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ అయ్యోరి రాజేష్, వైస్ చైర్మన్ అక్కనపెల్లి సునిల్ కుమార్ తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News