Wednesday, May 15, 2024

మోడీకి వ్యతిరేకంగా మాట్లాడాలని తమ పిల్లలకు నేర్పిస్తాం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్: ప్రధాని మోదీకి వ్యతిరేకంగా మాట్లాడాలని తమ పిల్లలకు నేర్పిస్తామని ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలోని గుల్భర్గాలో జరిగిన ఓ సభలో అసదుద్దీన్ మాట్లాడుతూ ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు జైలుకు పంపించినా వెళ్లడానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. 24ఏళ్ల నుంచి సెక్యూరిటీ లేకుండా తిరుగుతున్నానని తనను ఎవరైనా చంపేయాలనుకుంటే చంపుకోవచ్చన్నారు. కాంగ్రెస్ పార్టీ అవసరం ముస్లింలకు లేదని, కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు తన చెప్పుతో సమానమన్నారు. ప్రతి ముస్లిం పౌరుడిని ఓవైసీలా తయారుచేస్తానని ఆయన స్పష్టంచేశారు. కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదన్నారు. రాముడి పేరుతో బిజెపి, శివుడి పేరుతో కాంగ్రెస్, హనుమాన్ పేరుతో ఆమ్‌ఆద్మీ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. మేం నిజమైన ముస్లిములమని చెప్పుకోడానికి గర్వంగా ఉందన్నారు.

asaduddin owaisi fires on PM Modi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News