బ్రిస్బేన్: కొత్త సీజన్లో ఆడిన తొలి టోర్నమెంట్లోనే ప్రపంచ నంబర్వన్ ఆష్లే బార్టీ (ఆస్ట్రేలియా)కు షాక్ తగిలింది. సొంత గడ్డపై జరుగుతున్న బ్రిస్బేన్ ఇంటర్నేషనల్ టెన్నిస్ టోర్నమెంట్లో టాప్ సీడ్ బార్టీ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే ఇంటిదారి పట్టింది. అమెరికాకు చెందిన క్వాలిఫయర్ జెన్నిఫర్ బ్రాడితో జరిగిన పోటీలో బార్టీకి చుక్కెదురైంది. ఈ మ్యాచ్లో బ్రాడి 64, 76తో బార్టీపై సంచలన విజయం సాధించి క్వార్టర్ ఫైనల్కు చేరుకుంది. చివరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్లో జెన్నిఫర్ అసాధారణ పోరాట పటిమతో చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.
మరోవైపు చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణిలు పెట్రా క్విటోవా, కరోలినా ప్లిస్కోవాలు కూడా క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. రెండో సీడ్ ప్లిస్కోవా 64, 67, 61తో క్రొయేషియా క్రీడాకారిణి అజ్లాను ఓడించింది. మరో పోటీలో ఐదో సీడ్ క్విటోవా 63, 62తో రష్యా క్రీడాకారిణి సమ్సానోవ్ను చిత్తు చేసింది. ఇతర పోటీల్లో మూడో సీడ్ నవోవి ఒసాకా (జపాన్), ఆరో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్) విజయం సాధించి క్వార్టర్ ఫైనల్ బెర్త్ను సొంతం చేసుకున్నారు.
Ashleigh Barty unfazed after shock Brisbane exit