- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్: సెప్టెంబర్ నెలలో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. సమావేశాల నిర్వహణ తేదీలపై ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక రెండు రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోనున్నారు. సెప్టెంబర్ 23వ తేదీతో అసెంబీ సమావేశాలు పెట్టి ఆరు నెలలు పూర్తి కావస్తోంది. సెషన్ కు సెషన్ కు మధ్య 6 నెలలకు మించి సమయం ఉండకూడదనే రాజ్యాంగ నిబంధన గడువు ఉంది. హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంతో దళిత బంధుపై ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వం ప్రత్యేకంగా కసరత్తు చేయనున్నట్టు సమాచారం.
- Advertisement -