Monday, April 29, 2024

‘శాకుంతలం’ షూటింగ్ కంప్లీట్.. మూవీ టీమ్ ఎమోష‌న‌ల్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అక్కినేని స‌మంత ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘శాకుంతలం’. దిల్‌రాజు ప్రొడక్షన్స్‌, గుణటీమ్‌ వర్క్స్‌ పతాకాలపై పాన్ ఇండియా మూవీగా నీలిమా గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డైరెక్టర్ గుణ‌శేఖ‌ర్ ఈ క్రేజీ పౌరాణిక మూవీని రూపొందిస్తున్నాడు. ఇందులో సమంత శాకుంత‌ల పాత్రలో నటిస్తుండగా.. దుష్యంతుడి పాత్రలో మలయాళీ యువ నటుడు దేవ్‌ మోహన్‌ నటిస్తున్నాడు. ఈ మూవీలో స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అర్హ  భరతుడిగా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కు చిత్రయూనిట్ గుమ్మడికాయ కొట్టిసేంది. మంగళవారం ‘శాకుంతలం’ మూవీ షూటింగ్ విజయవంతంగా పూర్తైందని తెలియజేస్తూ మూవీ మేకర్స్ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కు దర్శక నిర్మాతలు గిఫ్ట్స్ అందజేశారు. ఇన్నిరోజులు ఏకధాటిగా కలిసి పనిచేసిన చిత్రయూనిట్ కు వీడ్కోలు పలుకుతూ దర్శక నిర్మాతలు ఎమోషనల్‌ అయ్యారు. కాగా, చిత్రీకరణ పూర్తికావడంతో వేగంగా గ్రాఫిక్స్ వర్క్స్ కంప్లీట్ చేసిన త్వ‌ర‌లోనే ఈ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

‘Shakuntalam’ Movie Shoot Wrap Up

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News