Friday, May 10, 2024

రెండో వికెట్ కోల్పోయి ఆసీస్

- Advertisement -
- Advertisement -

ధర్మశాల: వరల్డ్ కప్‌లో భాగంగా హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 27 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 215 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. ట్రావిస్ హెడ్ సెంచరీతో చెలరేగాడు. హెడ్ 67 బంతుల్లో 109 పరుగులు చేసి గ్లెన్ ఫిలీప్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. డేవిడ్ వార్నర్ 81 పరుగులు చేసి గ్లెన్ ఫిలీప్స్ బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో మిచెల్ మార్ష్(11), స్టీవెన్ స్మిత్ (10) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News